ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేయాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంపై తాజాగా విజయవాడ ఎంపీ, తెదేపా నేత కేశినేని నాని ఫేస్బుక్లో స్పందించారు.
‘‘ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే... అది ప్రజాధనంతో నిర్మించిన relojes de imitacion వేదిక. ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్నీ తొలగించిన తర్వాతే.. ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలుగా నష్టం. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తే సొమ్ము వృథా అవుతుంది. మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికలకు డబ్బు ఖర్చవుతుంది. ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈలోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ప్రజావేదిక తొలగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని కేశినేని తెలిపారు.