వచ్చే ఏడాది... తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సజీవయ్య శజయంతి వేడుకలు

వచ్చే ఏడాది... తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సజీవయ్య శజయంతి వేడుకలు

దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు దామోదరం సంజీవయ్య ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి దాసరి శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాద్‌ ప్రశాసన్‌ న గర్‌లో మంగళవారం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో bolsos imitacion  సేవలు అందించారని... హైదరాబాదులో బీ.హెచ్.ఈ.ఎల్, బి.డి.ఎల్, హెచ్.ఏ.ఎల్, విశాఖ ఉక్కు కర్మాగారం తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని దాసరి శ్రీనివాసులు అన్నారు. కాపుల రిజర్వేషన్ ప్రతిపాదనలను తీసుకువచ్చి అమలు చేశారని అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన సంజీవయ్య పేరును ఆయన సొంత జిల్లా  అయిన కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మాణించినట్లు తెలిపారు. 

దామోదరం సంజీవయ్య శతజయంతోత్సవాలను ఫిబ్రవరి 14, 2021 నుండి ఫిబ్రవరి 14, 2022 వరకు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో సంవత్సరం పొడవునా గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు చేయూత, వికలాంగులకు, వృద్ధులకు, సంక్షేమం కొరకే కాక పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంజీవయ్య cosplay kaufen స్వగ్రామం పెదపాడును సంజీవయ్య స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని ఆయన సమాధి ప్రాంతాన్ని సంజీవయ్య పార్క్‌లో ఆయన వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి కె.పి రామయ్య, ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ నేలపూడి స్టాలిన్ బాబు, మాజీ పట్టణాభివృద్ధిశాఖ రీజినల్ డైరెక్టర్, సంస్థ ట్రస్టీ యర్రా సాయి శ్రీకాంత్ పాల్గొన్నారు. 

c
Become a Owner