సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక దళితులు ధర్నా చేపట్టారు. పరిశ్రమకు కావల్సిన 13 వేల ఎకరాల భూమిలో అగ్రభాగాన దళితుల భూమే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ భూములు లాక్కోవటం వలన దళితుల బ్రతుకులు copie montre de luxe అగమ్యగోచరంగా మారిపోయాయని అన్నారు.
ఇప్పటి వరకు సేకరించిన భూమిలో బాధితులకు రావలసిన పరిహారం పూర్తి స్థాయిలో అందకపోగా వారికి ఏర్పాటు చేస్తామన్న పునరావాసాన్ని కూడా అధికారులు గాలికొదిలేశారని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ వంటి కార్యక్రమాలకు దళితుల భూమిలే తీసుకోవటంతోపాటుగా.. పరిశ్రమల ఏర్పాటుకు దళితుల భూమివైపే చూడటం శోచనీయమైన విషయమన్నారు.