ఆర్థిక రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ నివాసం ఉన్న ‘రాజగృహ’పై ఇద్దరు దుండగులు దాడిచేశారు. దాదర్లో ఉన్న ఈ మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు వరండాను, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఖండించారు. ఈ సంఘటనపై తక్షణమే దర్యాపు చేయాలని పోలీసులును ఆదేశించామని, నిందితులను త్వరలోనే అరెస్టు replica orologi audemars piguet చేస్తామని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
రాజగృహలో బీఆర్ అంబేద్కర్ తాను సేకరించిన పుస్తకాలను, సాహిత్యాన్ని పెద్దసంఖ్యలో నిల్వచేసేవారు. ప్రస్తుతం ఆ ఇంటిని అంబేద్కర్ వాడిన కొన్ని వ్యక్తిగత వస్తువులను ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు. అదేవిధంగా అంబేద్కర్పై పరిశోధనలు చేయాలకునేవారికి రాజగృహ ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నది.