ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పనిచేయవని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. బుధవారంనాడు బోగాపురం ఎయిర్ పోర్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన 2026లో ఈ ఎయిర్ పోర్టును తాను ప్రారంభించనున్నట్టుగా సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్, టూరిజం, ఐటీ, ఇండస్ట్రీకి భోగాపురం కేంద్ర బిందువుగా మారనుందని జగన్ చెప్పారు.