ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పంచాయతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరింది , కొన్ని రోజుల నుండి అయన పార్టీ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే , నిన్న పార్టీ ప్రాంతీయ కో-ఆర్దినటర్ పదవికి రాజీనామా చేసారు . ఈరోజు మధ్యాహ్నం అయన ముఖ్యమంత్రి ని కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాల గురించి అయన చర్చించారు , ముఖ్యమంత్రి ని కలిసిన అనంతరం మీడియా కు కనబడకుండా వెళ్లి పోయారు.